ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాన్ని విస్మరించింది

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 04:30 PM

భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ తప్పుకున్నారు. తమ పార్టీని సంప్రదించకుండానే యూసఫ్ పఠాన్‌ను ఈ బృందంలోకి ఎంపిక చేశారంటూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామం దౌత్య కార్యక్రమాల విషయంలో రాజకీయ పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తోంది.వివిధ దేశాలకు వెళ్లే ఈ దౌత్య బృందంలో అన్ని పార్టీల సభ్యులకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని బహరంపుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన యూసఫ్ పఠాన్‌ను కూడా ఎంపిక చేసింది. అయితే, ఈ ఎంపికపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.ఒక పార్టీకి చెందిన ఎంపీని ఏదైనా కార్యక్రమానికి ఎంపిక చేసేటప్పుడు సదరు పార్టీతో చర్చించడం కనీస పద్ధతని అభిషేక్ బెనర్జీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పాటించలేదని, తమను అడగకుండానే యూసఫ్ పఠాన్‌ను చేర్చుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ కారణంతోనే యూసఫ్ పఠాన్ కేంద్రం ఏర్పాటు చేసిన దౌత్య బృందం పర్యటనలో పాల్గొనడం లేదని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com