ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ చొరవతో,,,,ఏపీకి తీపికబురు చెప్పిన కర్ణాటక మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:27 PM

ఆంధ్రప్రదేశ్‌‌కు కుంకీ ఏనుగులు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. రాష్ట్రంలో పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుల బెడద నుంచి రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏనుగుల్ని అదుపు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సహకారంతో ఆరు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. ఈ మేరకు కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న బెంగళూరులోని విధానసౌధలో ఏనుగులను అప్పగించే కార్యక్రమం జరుగుతుందన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.


కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలతో స్నేహంగా ఉంటోంది అని మంత్రి ఈశ్వర్ ఖండ్రే అన్నారు. గతేడాది ఆగస్టు 8న పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులు కావాలని కోరారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 27న విజయవాడలో జరిగిన చర్చల్లో ఏనుగులను ఇచ్చేందుకు అంగీకరించారని.. ఇప్పుడు వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులను మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం లేదన్నారు. ఏపీ నుంచి ఏనుగులు కర్ణాటకలోకి రాకుండా అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది అన్నారు.


ఆంధ్రప్రదేశ్ (ఏపీ), కర్ణాటక ప్రభుత్వాలు కుంకీ ఏనుగుల విషయంలో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపడానికి ఈ ఒప్పందం కుదిరింది. చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ చర్య తీసుకున్నారు. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చించారు. కుంకీ ఏనుగులను పంపమని ఆయన కోరగా, వారు వెంటనే అంగీకరించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది.


చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల సంచారం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి కుంకీ ఏనుగులను తెస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో మాట్లాడిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ప్రస్తుతం అటవీ శాఖ దగ్గర ఉన్న ఏనుగులు వయసు పైబడటంతో ఇబ్బందులు వస్తున్నాయని.. అందుకే అదనంగా కొన్ని కుంకీ ఏనుగులను పంపమని కర్ణాటకను కోరామన్నారు. వీటి ద్వారా ఏపీలోని చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల సమస్యను అరికట్టవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com