IPL 2026 సీజన్లో మ్యాచ్ల నిడివి పెరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. రాత్రి ఆలస్యంగా మ్యాచ్లు ముగియడం వల్ల అభిమానులు, కామెంటేటర్లు మాత్రమే కాకుండా ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల వాంఖెడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ దాదాపు 4 గంటల 22 నిమిషాలు సాగడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఈ మ్యాచ్కు హాజరైన Marylebone Cricket Club హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్ స్లో ఓవర్రేట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్లో ఓవర్రేట్కు ఆటగాళ్లకంటే అంపైర్లే బాధ్యత వహించాలని, అందుకే వారిపైనే జరిమానాలు విధించాలని ఆయన సూచించారు.ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మ్యాచ్లు ఆలస్యంగా సాగడానికి ప్రధాన కారణం అంపైర్ల నిర్లక్ష్యమేనని అభిప్రాయపడ్డారు. ఆటను వేగంగా కొనసాగించడం పూర్తిగా అంపైర్ల బాధ్యత అయినప్పటికీ, వారు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. తరచూ ఫీల్డింగ్ మార్పులు, టైమ్ఔట్స్ మరియు అనవసర విరామాలు మ్యాచ్ వేగాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు.నిబంధనల ప్రకారం ఓవర్రేట్ ఆలస్యంపై వార్నింగ్స్ లేదా ఐదు పరుగుల పెనాల్టీలు విధించే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో అంపైర్లు వెనుకడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి స్లో ఓవర్రేట్ ఘటనకు ఆటగాళ్లకే కాకుండా అంపైర్లకూ జరిమానాలు విధిస్తేనే మ్యాచ్ వేగం పెరుగుతుందని సూచించారు.అంతేకాదు, The Hundred లీగ్లో లాగా 60 సెకన్ల క్లాక్ విధానం అమలు చేయాలని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే భారత పరిస్థితులు వేరు కావడంతో, వేడి వాతావరణంలో ఆటగాళ్లకు విరామాలు అవసరమని కూడా చెప్పారు. అయినప్పటికీ అనవసర ఆలస్యాలు తగ్గించాలంటే అంపైర్లు కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa