భారత మహిళా గ్రాండ్మాస్టర్ R. Vaishali అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ విజేతగా నిలిచి, ఈ పోటీల చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది.అంతేకాకుండా, ఈ విజయంతో ఈ ఏడాది జరగనున్న వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్కు కూడా ఆమె బెర్త్ ఖాయం చేసుకుంది. 13 రౌండ్లు ముగిసే సరికి వైశాలి 7.5 పాయింట్లతో కజకిస్తాన్కు చెందిన Bibisara Assaubayevaతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టైటిల్ సాధించాలంటే 14వ రౌండ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తుది రౌండ్లోనూ వైశాలి తన సత్తా చాటింది. ఉక్రెయిన్కు చెందిన Kateryna Lagnoపై 48 ఎత్తుల్లో విజయం సాధించి 8.5 పాయింట్లతో టోర్నీ విజేతగా నిలిచింది. ఈ కీలక రౌండ్లో మరో భారత గ్రాండ్మాస్టర్ Divya Deshmukh కూడా ముఖ్య పాత్ర పోషించింది. బిబిసారాతో జరిగిన తన మ్యాచ్ను ఆమె డ్రా చేసుకోవడంతో వైశాలికి అనుకూల పరిస్థితి ఏర్పడింది.ఒకవేళ ఆ మ్యాచ్లో బిబిసారా గెలిచి ఉంటే, ఇద్దరి స్కోర్లు సమం అయ్యి టైబ్రేకర్ అవసరం అయ్యేది. కానీ డ్రా ఫలితంతో బిబిసారా 8.0 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. దివ్య దేశ్ముఖ్ 5.5 పాయింట్లతో ఏడవ స్థానంలో నిలిచింది.ఈ విజయంతో వైశాలి ఈ ఏడాది జరగనున్న వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్మాస్టర్ Ju Wenjunతో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa