ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలా ఏఐ సంస్థ టెకీ ఆత్మహత్య

Crime |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 09:01 PM

బెంగళూరులో 25ఏళ్ల మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పని ఒత్తిడికి తట్టుకోలేకే టెకీ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఓలా ఏఐ సంస్థ కృత్రిమ్‌కు చెందిన 25 ఏళ్ల మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ నిఖిల్ సోమవంశీ మృతికి వర్క్ కల్చర్, మేనేజర్ దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. అందులో పనిచేసే కొందరు ఉద్యోగుల ప్రకారం.. నిఖిల్ ఆత్మహత్యకు చేసుకోడానికి ఒత్తిడితో కూడిన పని వాతావరణమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాల కిందట కనిపించకుండా పోయిన నిఖిల్ మృతదేహం మే 8న బెంగళూరులోని అగరా చెరువులో గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దే


బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన నిఖిల్.. 2024 ఆగస్టులో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా చేరారు. ఫ్రెషర్ అయినప్పటికీ ఓ ప్రాజెక్టుకు నిఖిల్ నేతృత్వం వహిస్తున్నాడని రెడిట్‌లో అతడి సహోద్యోగి తెలిపారు. ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఇద్దరు తప్పుకోవడంతో పని భారం సోమవంశీపైనే పడిందని, టీం మేనేజర్ రాజ్‌కిరణ్ పనుగంటి మీటింగ్స్ సమయాల్లో దారుణంగా మాట్లాడేవాడని వెల్లడించాడు. చిన్న చిన్న వాటికి రాద్దాంతం చేసి.. నానా రభసా చేసేవాడని ఆరోపించాడు.


కొత్తగా చేరిన ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ.. నోటికొచ్చినట్టు మాట్లాడుతాడని, అయన కారణంగా చాలా మంది ఉద్యోగానికి రాజీనామాలు చేసి వెళ్లిపోయారని పేర్కొన్నాడు. కంపెనీలో పనిచేసిన పలువురు (పేరును వెల్లడించకుండా) ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. టీమ్ మేనేజర్ రాజ్‌కిరణ్‌కి ఉద్యోగులను ప్రోత్సహించే లక్షణాలు లేవని, జూనియర్లను హీనంగా మాట్లాడుతుంటాడని చెప్పారు. అయితే, ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ అధికారి పని ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.


నిఖిల్ మృతిపై కంపెనీ స్పందిస్తూ.. ‘ఆయన సెలవులో ఉండగా ఇలా జరిగిందని.. మేము అధికారులకు సహకరిస్తున్నామని తెలిపింది. నిఖిల్ ఏప్రిల్ 8న మేనేజర్‌కు మెసేజ్ చేసి విశ్రాంతి అవసరం ఉందని తెలిపాడు... కంపెనీ వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేసింది. ఏప్రిల్ 17న ఇంకా కొంత విశ్రాంతి అవసరం ఉందని చెప్పడంతో సెలవు పొడిగించాం’ అని తెలిపింది.


గతేడాది ఎర్నెస్ట్ అండ్ యంగ్ చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ అనే 26ఏళ్ల యువతికి పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోవైపు, బజాజ్ ఫైన్సాన్స్‌లో పనిచేసిన 42ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడి, సూసైడ్ నోట్‌లో తన మేనేజర్, వర్క్‌ప్రెషర్ కారణమని ఆరోపించాడు. ఈ సంఘటనలు కార్పొరేట్ ప్రపంచంలోని మానవతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడితో కూడిన వాతావరణం కల్పించడం ఎంతో మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com