ట్రెండింగ్
Epaper    English    தமிழ்

48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు చనిపోయే అవకాశం ..: ఐరాస

international |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:45 PM

ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావడంతో తీవ్రంగా దాడులు చేస్తున్నారు. వందలాది డ్రోన్లతో రాత్రి, పగలనే తేడా లేకుండా దాడులు చేస్తూ.. వందలాది మంది ప్రాణాలు తీస్తున్నారు. ఇలా నిత్యం దాడులు జరుగుతుండగా.. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో గాజా భయానకంగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడి ప్రజలకు పరిమిత స్థాయిలో మాత్రమే ఇజ్రాయెల్ సాయానికి అనుమతిస్తుండగా.. ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. దీనిపై స్పందించిన ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇదే పరిస్థితి కొనసాగితే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.


మూడు నెలల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. ముఖ్యంగా హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీలను విడుదల చేయకపోవడంతో.. ఇజ్రాయెల్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ను నిర్బంధించి తరచుగా.. దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా దాడులు చేస్తూనే ఉండగా.. ఆ ప్రాంతమంతా శవాలతో నిండిపోయింది. అలాగే రక్తపు మడుగులతో నిండిపోయింది. ఎలాగైనా సరే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని.. అతి తక్కువ మాత్రమే మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది.


చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల 5 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందిందని ఐరాస ప్రతినిధి టామ్ ప్లేచర్ తెలిపారు. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని చెప్పారు. వారికి మరింత సాయం అవసరం అని వెల్లడించారు. లేదంటో మరో 48 గంటల్లోనే 14 వేల మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అక్కడున్న చిన్నారులు, తల్లులు పోషకాహార లోపంతో తీవ్రంగా బాధ పడుతున్నారని స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ వ్యాప్తంగా మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్‌పై విమర్శలు వస్తున్నాయి.


ఐరాస మాత్రమే కాకుండా బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు.. మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టారు. గాజాకు మానవతా సాయంపై తమ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాయి. తాజాగా ఇజ్రాయెల్ తీరుపై ఐరాస స్పందించింది. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించాలని.. అక్కడున్న చిన్నారుల, తల్లుల ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa