రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో వ్యక్తిగత స్కోరు 24 పరుగుల వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్టీ20తో కలిపి కోహ్లీ ఆర్సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ ముంబై తరుపున 6060 రన్స్ చేశాడు. ఆ తరువాత వరుసగా జేమ్స్ విన్స్, సురేశ్ రైనా, ధోని తదితరులు ఉన్నారు. ఇక లక్నోతో మ్యాచ్లో కోహ్లీ మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) – 9030 పరుగులు రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులు జేమ్స్ విన్స్ (హాంప్షైర్) – 5934 పరుగులు సురేశ్ రైనా (సీఎస్కే) – 5529 పరుగులు ఎంఎస్ ధోని (సీఎస్కే) – 5314 పరుగులు ఐపీఎల్లో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా.. ఐపీఎల్ 2025 సీజన్లోనూ కోహ్లీ 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వరుసగా మూడో సారి ఈ ఘనత అందుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇలా ఓ సీజన్లో 600 రన్స్ చేయడం ఇది ఐదో సారి. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ – 5 సార్లు (2013, 2016, 2023, 2024, 2025) కేఎల్ రాహుల్ – 4 సార్లు (2018, 2020, 2021, 2022) క్రిస్ గేల్ – 3 సార్లు (2011, 2012, 2013) డేవిడ్ వార్నర్ – 3 సార్లు (2016, 2017, 2019) ఐపీఎల్ 2025 సీజన్లో కోహ్లీ 60.20 సగటు 147.91 స్ట్రైక్రేటుతో 602 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa