ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బదులు ఇకపై కూపన్లు, నగదు,,,ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో.. కూటమి ప్రభుత్వం తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేశామని చెప్పుకుంది. ఇక సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా తాజాగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి.. లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసింది. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏడాది పాలన పూర్తైన సందర్భంగా కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా రేషన్ వ్యవస్థలో భారీగా మార్పులు చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. ఆ వివరాలు..


ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రేషన్ పంపిణీ వ్యవస్థలో నూతన సంస్కరణలు అమలు చేయాలని కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. రేషన్ పంపిణీలోను.. కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోందట. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి అనేక సూచనలు చేశారని తెలుస్తోంది.


కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఐవీఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రజాభిప్రాయాలపై.. చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన మార్పులపై సమీక్షించినట్లు తెలుస్తోంది. అలానే ఈ నెల రేషన్ పంపిణీలో భాగంగా.. వృద్దులు, వికలాంగులకు రేషన్‌ సరుకులను ఇంటికి తీసుకువెళ్లి అందించారు సిబ్బంది. దీన్ని ఇలానే కొనసాగించాలని.. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారట.


రేషన్ పంపిణీ వ్యవస్థను మెరుగు పర్చేందుకు చౌకధరల దుకాణాలను పెంచడమే కాక.. రేషన్ వద్దనుకునే వారికి నగదు, లేదా కూపన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందట. దీనికి సంబంధించి మరిన్ని ప్రత్యామ్నాయలపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు. రేషన్ బదులు నగదు జమ అంశాన్ని గతంలోనే చంద్రబాబుప్రస్తావించారు.


అయితే తాజాగా దీనిపై పూర్తిగా ప్రజాభిప్రాయం వచ్చిన తర్వాతే ముందుకు అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది . అలానే ఐవీఆర్‌ఎస్ సర్వేలో అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa