ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలానికి వరద..అర్చకులు ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:29 PM

మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ కు నీటిమట్టం పెరగడంతో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరాలయంలో వేపదారు శివలింగాన్ని కృష్ణానది జలాలు తాకాయి. దీంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు నీటి గర్భంలోనే ఉంటుంది. 4 నెలలు మాత్రమే భక్తులు సర్వేశ్వరుడిని దర్శించుకోవచ్చు.జలాశయం పరిధిలోని సంగమేశ్వర ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఉంది. వరదల కారణంగా ఏటా సంగమేశ్వరుడి ఆలయం నీట మునుగతున్నప్పటికి సాధారణ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శిస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa