ఉత్తర్ప్రదేశ్ హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత.. ఆ నవ వధువు తన ప్రియుడితో లేచిపోయింది. అయితే తన భార్య పోతూ పోతూ లక్షల విలువైన నగలు, డబ్బుతో పారిపోయిందని ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని భార్యను పట్టుకుని.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సారావా గ్రామానికి చెందిన సల్మాన్ వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన లోనీ ప్రాంతంలో నివసించే సనా అనే యువతితో సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు. మే 13వ తేదీన రాత్రి సనా.. తన భర్త, కుటుంబ సభ్యులకు లస్సీ చేసి అందించింది. ఆ లస్సీ తాగిన తర్వాత అంతా స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో.. ఇంటి చుట్టుపక్కల వారు తలుపు తెరిచి వారిని నిద్రలేపారు. అయితే తన భార్య కనిపించకపోవడంతో సల్మాన్కు అనుమానం వచ్చింది. తన ఇంట్లో ఉన్న రూ.44,500 నగదు, లక్షల విలువైన నగలు కూడా మాయమయ్యాయని వారు గుర్తించారు.
దీంతో ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సల్మాన్ కుటుంబం చెక్ చేయగా అసలు విషయం బయటికి వచ్చింది. రాత్రి 12:30 గంటలకు సనా.. ఓ యువకుడితో బైక్పై వెళ్తున్నట్లు ఆ వీడియోలో గుర్తించారు. దీని ఆధారంగా లస్సీలో సనా మత్తు పదార్థాలు కలిపి తాగించి.. ఆపై తన ప్రియుడితో పారిపోయిందని కుటుంబ సభ్యులు పసిగట్టారు. ఇదే విషయాన్ని సనా కుటుంబ సభ్యులకు చెప్పినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారు హాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హాపూర్ కొత్వాలిలో కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు సనాను పట్టుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో వెళ్లేందుకు సనా నిరాకరించడంతో పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa