ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్కు మద్దతునిస్తూ.. అమెరికా కూడా ఆదివారం రోజు ఇరాన్పై దాడి చేసింది. దీంతో ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్తో ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరింపజేశారని ఇరాన్ వివరిస్తోంది. ఈ దాడి అనంతరమే ఒప్పందం కోసం ట్రంప్ తమను ప్రాధేయ పడ్డారని పేర్కొంటోంది.
IRINN టీవీ యాంకర్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక చర్య అమెరికాకు ఒక బలమైన సందేశాన్ని పంపిందని అన్నారు. ట్రంప్ వెంటనే కాల్పుల విరమణ కోసం అభ్యర్థించారని ప్రశంసించారు. ఖతార్ ప్రధాన మంత్రి, ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇరాన్తో కాల్పుల విరమణకు ఇరాన్ ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. అయితే ఇదంతా ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే జరిగిందని వివరించారు. ఈ దాడి తర్వాతే ఒప్పందం కోసం ట్రంప్ ఇరాన్ను ప్రాధేయపడ్డారని వెల్లడించినట్లు బీబీసీ పర్షియా స్పష్టం చేసింది. ఈ సందర్భంగానే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్, ఆర్మీ, ఇరాన్ వాసుల ప్రతిఘటనను అభినందించింది.
ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన సైనిక బలాన్ని, దౌత్య ప్రభావాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. IRGC దాడుల తర్వాత అమెరికా సైనిక స్థావరాలపై కలిగిన ఒత్తిడి కారణంగానే ట్రంప్ కాల్పుల విరమణను కోరారని ఇరాన్ పేర్కొనడం, వారి అంతర్గత రాజకీయాల్లో తమ విజయాన్ని ప్రజలకు చాటిచెప్పే ప్రయత్నంగా కనిపిస్తోంది.
మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ దేశంపై క్షిపణి దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఐడీఎఫ్ కూడా ఇప్పటికే ధ్రువీకరించింది. తాజాగా జరిగిన క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు కూడా చనిపోయినట్లు ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్మెంట్ పేర్కొంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa