అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించారు. శుభ్మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో 200 పరుగులు పూర్తి చేసుకున్నారు. టెస్టుల్లో శుభ్మన్ గిల్కు ఇదే తొలి డబుల్ సెంచరీ. దీంతో 122 ఓవర్లకు భారత్ స్కోరు 472/6గా ఉంది. క్రీజులో గిల్ (200), సుందర్ (21) పరుగులతో ఉన్నారు.అంతేకాదు, విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 2016లో కోహ్లీ వెస్టిండీస్పై సరిగ్గా 200 పరుగులు చేసి ఔటయ్యాడు. SENA దేశాల్లో శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్గానూ గిల్ ఘనత సాధించాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్గానూ నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (7), మన్సూర్ అలీ ఖాన్, సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, ధోనీ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు. 2003 తర్వాత ఇంగ్లాండ్పై ద్వి శతకం చేసిన తొలి విదేశీ ఆటగాడు గిల్యే కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa