కష్టాలలో ఉన్న రైతులను పరామర్శించడానికి వైయస్ఆర్ సిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెళ్ళితే, ఏకంగా రైతులపై ఎస్ పి స్థాయి జిల్లా అధికారులు లాఠీ చార్జి చేయడం దుర్మార్గని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో మిర్చి రైతుల సమస్యలపైన, పొగాకు రైతుల గురించి ప్రతిపక్ష నేత జగన్ వెళ్లి మాట్లాడితేనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వస్తున్నామని చెప్పడంతో రెండు మూడు రోజులుగా ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.ప్రతి పక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను, రైతుల పడుతున్న కష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి కళ్లు తెరిపంచడానికి జగన్ బంగారుపాలెం పర్యటన చేపడితే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఐదు వందల మంది రైతులు మాత్రమే రావాలని చెప్పడం ఎంత విడ్డూరమన్నారు. అభిమానం ఉన్న రైతులు, కష్టాలు చెప్పుకోవడానికి తరలి వస్తుంటే అడ్డుకుని , కెమెరాలతో ఫోటోలు తీసుకుంటున్నాం..రౌడీ షీట్లు తెరుస్తాం..కేసులు పెడదామని పోలీసులు బెదిరించడం .. స్వయంగా ఎస్ పి స్థాయి అధికారులే రైతులపైన లాఠీ చార్జి చేసి రక్త గాయాలు అయ్యేటట్లు కొట్టడం ఎంతవరకు సమంజస మన్నారు.పూర్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని విస్మరించి, కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ, సొంత రాజ్యాంగం సృష్టించుకుని రాచరిక, నియంత ,సైనిక పాలన మాదిరిగా అరాచక పాలన సాగిస్తుండడం సరైన విధానం కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa