భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు అనుసరించిన 'బాడీలైన్' వ్యూహాలపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లార్డ్స్ మైదానంలో నేడు మూడో రోజు ఆటలో, ఇంగ్లండ్ ఏడుగురు ఫీల్డర్లను లెగ్ సైడ్లో ఉంచడంపై గవాస్కర్ మండిపడ్డారు."ఇది క్రికెట్ కాదు. ఐసీసీ క్రికెట్ కమిటీ అధిపతిగా ఉన్న సౌరభ్ గంగూలీ దీనిపై దృష్టి సారించాలి. దయచేసి లెగ్ సైడ్లో ఆరుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచేలా నిబంధనలు సవరించాలి" అని గవాస్కర్ తీవ్ర స్వరంతో అన్నారు. ఇంగ్లండ్ జట్టు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ ఈ వ్యూహాలను ఉపయోగించింది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలింగ్లో ఎక్కువ బౌన్సర్లు వేయకపోయినప్పటికీ, గవాస్కర్ మాత్రం వారి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ను 'బాడీలైన్' వ్యూహంగా అభివర్ణించారు. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే ఇటువంటి వ్యూహాలను అడ్డుకోవాలని ఐసీసీ క్రికెట్ కమిటీ అధిపతి సౌరవ్ గంగూలీకి విజ్ఞప్తి చేశారు.మూడవ రోజు ఆటలో లంచ్ సమయానికి భారత్ 248 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 387 కంటే 139 పరుగులు వెనుకబడి ఉంది. కేఎల్ రాహుల్ 98 పరుగులతో అద్భుతమైన సెంచరీకి చేరువలో ఉండగా, రిషబ్ పంత్ 74 పరుగులు చేసి లంచ్ సమయానికి బెన్ స్టోక్స్ చేతిలో రనౌట్ అయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa