ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ అఖాల్..: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:21 PM

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత చర్యలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే కుల్గామ్ జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు ‘ ఆపరేషన్ అఖాల్ ’ అని పేరు కూడా పెట్టినట్లు స్పష్టం చేసింది.


భద్రతా దళాలకు అందిన పక్కా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. కుల్గామ్ జిల్లాలోని నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం రావడంతో.. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో.. సైన్యం కూడా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పులలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు ఇతర నేరపూరిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతలను కాపాడటానికి, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భద్రతా దళాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి ముష్కరులను ఏరి వేసేందుకు సైన్యం అనేక చర్యలు చేపడుతోంది. ఉగ్రవాదుల కదలికలను నిలువరించడం, వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ‘ఆపరేషన్ అఖాల్’ కూడా అందులో ఒక భాగమే. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున.. పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారని అనుమానిస్తున్నారు. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.


ముఖ్యంగా ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. అయితే మే 7వ తేదీన దీన్ని ప్రారంభించగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వంద మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది. ఇటీవలే ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి.. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్ని ముగ్గురు ముష్కరులను చంపేసింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత జరిగిన శివశక్తి ఆపరేషన్‌లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా నిర్వహిస్తూ వస్తున్న ఆపరేషన్లోల ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వారిలో ఆరుగు పాకిస్థానీ ఉగ్రవాదులు కాగా.. మరో ఆగురుకు జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులతో సంబంధం ఉందని పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa