గత కొన్ని రోజులుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై బీసీసీఐని ఉద్దేశించి ఫ్యాన్స్.. విమర్శలు గుప్పిస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన వ్యక్తి, బ్యాటింగ్లో 150కి పైగా స్ట్రైక్రేట్తో రన్స్ చేసిన ఆటగాడిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ .. ఈ విషయంపై స్పందించాడు. శ్రేయ్ అయ్యర్ను ఎందుకు తీసుకోలేదో వివరణ ఇచ్చాడు.
“ఆసియాకప్ 2025 జట్టులో ఎంపిక కాకపోవడంలో శ్రేయస్ అయ్యర్ తప్పు లేదు. కానీ అతడిని ఎవరి ప్లేసులో తీసుకోవాలో చెప్పండి? అతడు మెరుగైన ఆటగాడే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోలేకపోయాం. ప్రస్తుతానికి అతడు తన అవకాశం కోసం ఎదురుచూడాల్సిందే” అని అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు.
కాగా ఈ వివరణ పట్ల టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు. 15 మంది ఆటగాళ్లలో ఫిట్ కానప్పుడు.. రిజర్వ్ ఆటగాళ్ల లిస్ట్లో అయినా ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆసియాకప్ కోసం టీమిండియా స్టాండ్బై ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్ ఎంపికయ్యారు. దీంతో ఇందులో కూడా శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ ఏం తప్పు చేశాడని పేర్కొంటున్నారు.
కాగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేశాడు. 17 మ్యాచ్ల్లో 175.07 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు చేశాడు. కెప్టెన్గా తన జట్టు అయిన పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అదరగొట్టాడు. ఈ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లో 243 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున చివరిసారిగా అయ్యర్ బెంగళూరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తలపడ్డాడు. అందులో క్లిష్ట పరిస్థితుల్లో 54 రన్స్ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa