భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. దక్షిణ భారతదేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి.కావేరి నది తీరంలోనూ అనేక దేవాలయాలు వెలసి ఉన్నాయి. వాటిలో ప్రత్యేక ప్రాధాన్యం పొందిన ఆలయం నిమిషాంబ దేవి ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.ఇక్కడ భక్తులు ఒక నిమిషం లోపే కోరిక కోరుకోవాలి. 21 సెకన్లు, 21 నిమిషాలు, 21 రోజుల్లోనే కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఈ దేవాలయం కర్ణాటకలోని శ్రీరంగపట్నం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని గంజాం గ్రామంలో ఉంది. పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ దేవిని, శివుని భార్య పార్వతీ దేవి పునర్జన్మగా భావిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలు ఒక్క నిమిషంలోనే నెరవేరతాయని నమ్మకం. నవరాత్రులు, మహాశివరాత్రి, ఉగాది, దీపావళి వంటి పండుగల రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.భక్తులు అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండను సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజా గదిలో ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.ఈ ఆలయంలోని మరో విశేషం బలి భోజనం. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత, పూజారి బలిపీఠంపై ఆహారం ఉంచుతారు. ఆలయ గంట మోగగానే కాకులు వచ్చి ఆహారం తీసుకెళ్లడం భక్తులు ఆశ్చర్యంగా చూస్తారు.తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగపట్నానికి చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మైసూర్ విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సులు, ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. మైసూర్ నుంచి సుమారు 135 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. అలాగే శ్రీరంగపట్నం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి ఆటో లేదా టాక్సీ ద్వారా గంజాం గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa