ఈ నెల 15వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. జూన్ 1వ తేదీన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. అదే నెలలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 17న వాయువ్య భారతం నుంచి మొదలై అక్టోబర్ 15వ తేదీలోపు పూర్తవుతుంది. పశ్చిమ రాజస్తాన్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రుతుపవనాల ఉపసంహరణకు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa