రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు అల్లిన కట్టుకథే లిక్కర్ స్కాం అని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అల్లిన ఈ కట్టుకథలకు మరికొన్ని పిట్టకథలను జత చేయడమే సిట్ చేస్తున్న పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారం లోకి రాగానే సీఎంగా చంద్రబాబు అబద్దాల పునాదుల మీద లిక్కర్ స్కాంను ప్రారంభించారని ధ్వజమెత్తారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, వెంటనే లిక్కర్ స్కాంలో అరెస్ట్లు అంటూ ఎల్లో మీడియా ద్వారా హోరెత్తించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాడని అన్నారు. అయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు ఎనిమిది వందల కేసులు పెట్టారు. పదుల కొద్ది మందిని జైలుకు పంపారు. వైయస్ఆర్సీపీ విషయంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల మీద వేల కొద్ది తప్పుడు కేసులు పెట్టారు. సాక్షి పత్రికపైన కూడా ఇదే విధంగా అక్రమ కేసులను బనాయించేందుకు తెగబడ్డారు. సాక్షి ఎడిటర్ పై అయిదు ఎఫ్ఐఆర్లు పెట్టి, బెదిరించే ప్రయత్నం చేశారు. కూటమి పాలనకు భజన చేసే వారిని తప్ప, వారి వైఫల్యాలను ఎత్తి చూపే వారిని సహించమనే దోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa