ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తని పరామర్శించిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 11:24 AM

కూటమి నేతలు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడడం దారుణమని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నాయకులు చేయకూడని తప్పు లు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులతో భయోత్పాతం సృష్టిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా తాళ్ళ పాలెంలో జనసేన రౌడీ మూకల చేతిలో దాడికి గురైన పార్టీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్), సతీష్‌తో శుక్రవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారు. ధైర్యం కోల్పోవద్దని వారికి సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. తమపై గూండాలు ఎలా దాడి చేశారనేది గిరిధర్, సతీష్ ఇద్దరూ వైయ‌స్ జగన్‌కు వివరించారు. తనను కులం పేరుతో దూషించారని, దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారని సతీష్ తెలిపారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైయ‌స్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో వారు కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఏది ఏమైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారికి వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుదామన్నారు. గిరిధర్, సతీష్ కుటుంబాలకు మాజీ మంత్రి పేర్నినాని అండగా ఉంటారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa