గుంటూరు జిల్లా, రావిపాటివారిపాలెం గ్రామానికి చెందిన చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించిన శ్యామూల్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్కుమార్ ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రావిపాటివారిపాలెం గ్రామానికి చెందిన చిన్నారులను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారికి న్యాయం చేసే వరకూ పోరాడతానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, రక్షణ గాలికి వదిలేసి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవటంలో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై వాసిమళ్ల శ్యామూల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినా కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేని ఎమ్మెల్యే ఉన్నా.. లేకున్నా ఒకటేనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa