ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లి రైతులకి ఎకరాకు రూ.80 వేలు నష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 04:03 PM

ఉల్లి ఎకరాకు దాదాపు 100 క్వింటాళ్ల వరకు పండుతుంది. అలా ఒక హెక్టార్‌లో దాదాపు 250 క్వింటాళ్ల ఉల్లి ఉత్పత్తి అవుతుంది. క్వింటా ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.1200. ఆ ప్రకారం ఒక హెక్టార్‌లో పండే ఉల్లికి రైతులకు రూ.3 లక్షల ఆదాయం రావాలి. కానీ, ఈ ప్రభుత్వం ఉల్లి రైతులకు ఒక్కో హెక్టార్‌కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెబుతోంది. నిజంగా అలా ఇచ్చినా, ఉల్లి రైతు ఒక్కో ఎకరానికి రూ.80 వేల చొప్పున నష్టపోతాడు. మరి ఈ ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకున్నట్లు! పైగా ఇస్తామన్న పరిహారానికి సంబంధించి, ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అలాంటప్పుడు అసలు ఆ పరిహారం ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదు.     అయినా కూటమి నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారు. ఉల్లి రైతులకు విపత్తులు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తాయి. కానీ, మేము రూ.50 వేలు ఇస్తున్నాం అని ఘనంగా చెప్పుకోవ‌డం సిగ్గుచేటు అని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త  కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa