ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యం కాపాడుకోవడమే అన్నిటికన్నా ముఖ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 06:13 PM

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) వైద్యా, ఆరోగ్య శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్లమంది జనాభా ఉన్నారని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ జనాభా 162 కోట్లు దాటుతుందని చెప్పుకొచ్చారు. 2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం కాపాడుకోవడం అతిముఖ్యమని సూచించారు. దక్షిణాదిలో జనాభా క్రమంగా తగ్గుతోందని చెప్పుకొచ్చారు. యూపీ, బిహార్‌ వల్లే జనాభా బ్యాలెన్స్‌ అవుతూందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతోందని తెలిపారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ అని వివరించారు.WHO ప్రకారం మెడికల్‌ ఆఫీసర్లు మనదగ్గరే ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రస్తుతం 1.15 లక్షలమంది వైద్యులు ఉన్నారని వెల్లడించారు. భారతదేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్లు అని వివరించారు. భారతదేశంలో MMRR 30గా ఉందని తెలిపారు. మనదేశంలో ఇమ్యూనైజేషన్‌ 97 శాతమని చెప్పుకొచ్చారు. ఏపీలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 42 శాతమేనని వివరించారు.ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు 78 శాతం సాధించామని వెల్లడించారు. త్వరలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 100 శాతం సాధిస్తామని ఉద్ఘాటించారు. గర్భిణుల్లో అనీమియా 32 శాతం ఉందని తెలిపారు. సిజేరియన్‌లో మనమే నెంబర్‌వన్‌.. ఇది సరికాదని చెప్పుకొచ్చారు. 90 శాతం సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa