సాధారణంగా చాలా తక్కువ కంపెనీల సీఈఓలు మాత్రమే.. ఉద్యోగుల బాగోగులు పట్టించుకుంటూ ఉంటారు. అందులోనూ తమకు నచ్చిన వారికి పెద్ద ఎత్తున సాయం చేస్తుంటారు. అచ్చంగా ఇలాగే చేసిందో కంపెనీ యజమాని. ముఖ్యంగా తన వద్ద పని చేసే ఓ యువకుడు తన భార్యతో విడాకులు తీసుకోవడానికి పెద్ద ఎత్తున డబ్బు సాయం చేసింది. ఎవరూ ఊహించని స్థాయిలో రూ.3.6 కోట్లు ఇచ్చింది. కానీ ఆపై ఏడాదికే కోర్టుకు ఎక్కి తన డబ్బు తనకు కావాలని డిమాండ్ చేసింది. అసలామె అంత డబ్బు ఎందుకిచ్చింది, మళ్లో కోర్టుకు ఎందుకు ఎక్కింది, చివరకు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.
చైనాలోని చోంగ్కింగ్ నగరానికి చెందిన ఝు అనే వ్యాపారవేత్త ఒక కంపెనీని నడుపుతున్నారు. అయితే ఆమె కంపెనీలో హే అనే యువకుడు ఉద్యోగిగా చేరాడు. వీరిద్దరికీ అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. సీఈఓకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఉద్యోగికి ఓ పాప ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోని వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఎవరికీ తెలియకుండా శారీరక సంబంధం కూడా కొనసాగించారు. ఈక్రమంలోనే పెళ్లి చేసుకుని కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకోసం ఇద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా భావించారు. ఝ తన భర్తతో విడాకులు తీసుకుంది. హే కూడా తన భార్య చెన్కు విడాకులు ఇస్తానన్నాడు. అప్పటికే వారిద్దరికీ ఓ పాప ఉండగా.. ముందు ఆమె ఒప్పుకోలేదు.
ఇదే విషయాన్ని హే.. ఝకు చెప్పగా ఆమె నష్టపరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే విడాకులు ఇస్తుందని సలహా ఇచ్చింది. కానీ తన వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవని హే వివరించగా.. ఝ నేనిస్తానని చెప్పింది. మొత్తంగా 3 మిలియన్ల యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.3.6 కోట్లు) ప్రియుడికి ముట్టజెప్పింది. అతడు కూడా ఆ డబ్బును తన భార్య చెన్కు ఇచ్చి.. తనను వదిలేయమన్నాడు. బిడ్డ పోషణ కోసం డబ్బును వాడుకోవాలని చెప్పాడు. ఇక చేసేదేమీ లేక చెన్ కూడా విడాకులు ఇచ్చేసింది. ఇద్దరూ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చేయగా.. కలిసే జీవించారు. ఏడాది పాటు వీరి జీవితం చాలా అన్యోన్యంగా సాగింది. కానీ ఆ తర్వాతే గొడవలు ప్రారంభం అయ్యాయి.
దీంతో తామిద్దరూ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదని భావించి విడిపోవాలనుకున్నారు. ఇలా హే తన భార్య చెన్ వద్దకు తిరిగి వెళ్లాడు. ఈక్రమంలోనే ఝ.. తాను హేకు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. కానీ అతడు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం హే, చెన్ దంపతులను తిరిగి ఝకు డబ్బులు ఇవ్వాలని సూచించింది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దంపతులు పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అక్కడే విచారణ జరిపిన న్యాయస్థానం షాకింగ్ తీర్పును ఇచ్చింది.
ఝు తాను ఇచ్చిన డబ్బు చెన్కు వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతి అని నిరూపించడానికి తగిన ఆధారాలు చూపలేదని పైకోర్టు పేర్కొంది. అందువల్ల ఆ డబ్బును వెనక్కి ఇవ్వాలని ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ముఖ్యంగా 3 మిలియన్ల యువాన్లు ఝ నుంచి వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతి కాదని.. హే తన భార్యకు విడాకుల పరిహాహం, బిడ్డ పోషణ కోసం ఇచ్చిన డబ్బుగా పేర్కొంది. అలాగే విడాకులకు ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత డబ్బును తిరిగి ఇవ్వమని కోరడం ద్వారా ఝు అనైతిక చర్యకు పాల్పడిందని కోర్టు అభిప్రాయ పడుతూ.. ఆమెకు శిక్షను కూడా విధించింది. ఇలా ఈ వార్త అంతర్జాతీయ వ్యాప్తంగా వైరల్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa