రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ తన వర్గ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకె శైలజానాథ్ ఆక్షేపించారు. ఒక వైపు కేంద్రం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తపన పడుతుంటే, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అందుకు భిన్నంగా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణను రద్దు చేసి మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకోవర్ చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa