ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక 'ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి' ఏర్పాటుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో, రాష్ట్రానికి మరిన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు వీలుగా నిబంధనలను సరళీకరిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. శుక్రవారం శాసనసభలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa