ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ ఆటలు ఇక సాగవు: మంత్రి నారా లోకేష్ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 12:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్ని, వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. చట్టం నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు ఇక సాగవని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియోని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa