ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతిపై పోరాడినందుకే ఐపీఎస్ అధికారి వై.పురన్ కుమార్ ని వేధించారు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 03:22 PM

హర్యానా పోలీసు శాఖలో మరో ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో రోహ్‌తక్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దివంగత ఐపీఎస్ అధికారి వై.పురన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ పురన్ కుమార్‌ను అరెస్ట్ చేసే వరకు సందీప్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. పోలీసులకు మృతదేహాన్ని అప్పగించకుండా తమ స్వగ్రామానికి తీసుకెళ్లి నిరసన తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై.పురన్ కుమార్ గన్‌మెన్‌ను లంచం కేసులో ఏఎస్ఐ సందీప్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచే ఉన్నతాధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, టార్చర్ చేస్తున్నారని చనిపోవడానికి రెండు రోజుల ముందు సందీప్ తమతో చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అవినీతిపై పోరాడినందుకే తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని, అతడు భగత్ సింగ్ లాంటి అమరవీరుడని సందీప్ బంధువు శిశ్‌పాల్ లథార్ ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఐపీఎస్ పురన్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలని, ఆయనకు సుమారు రూ. 2,000 నుంచి రూ. 3,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని శిశ్‌పాల్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa