ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో స్కూల్ పిల్లలకు ,,,,బడిలో ఉచితంగా ఆధార్ క్యాంపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 08:41 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంప్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి 30 వరకు రాష్ట్రంలోని స్కూళ్లలో ఈ ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 16,51,271 మంది పిల్లల బయోమెట్రిక్‌ల‌ను అప్డేట్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ యూఐడీఏఐ సమన్వయంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. పిల్లల బయోమెట్రిక్‌ల‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితం.. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.


పిల్లలను బడిలో చేర్పించాలన్నా, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు కూడా ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో ఆధార్ నమోదు కేంద్రాలు ఉండేవి.. ఇప్పుడు బ్యాంకులు, పోస్టాఫీసులు, గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ కార్డులను ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్‌ ఛార్జీలు పెరిగాయి. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మార్చుకోవడానికి గతంలో రూ.50 ఉండగా, ఇప్పుడు రూ.75 అయ్యింది. సాధారణ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100 నుంచి రూ.125కు, డాక్యుమెంట్‌ అప్‌డేట్‌కు రూ.50 నుంచి రూ.75కు పెంచారు. అయితే, కొన్నినేను స్టూడెంట్.. నువ్వు నా టీచర్..' నంద గోకులం విద్యార్థులతో చంద్రబాబు సరదా ముచ్చట


కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు తమ బయోమెట్రిక్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థులు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోతే సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల కోసం బాల ఆధార్‌ నమోదును సులభతరం చేయడానికి, ప్రతి మండలంలో నాలుగు చొప్పున ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు ఆధార్‌ నమోదు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఆధార్‌ ఛార్జీలు పెరిగినప్పటికీ, ముఖ్యమైన సేవలను ఉచితంగా అందించడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa