ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తురకపాలెం మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 12:40 PM

గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామంలో 10 నెలల్లో 45 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు అని వైసీపీ గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకులు పోతిన మహేష్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... గుంటూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురకపాలెం గ్రామంలో అమరావతి రాజధానిలోనే మంచినీరు తాగితే చనిపోతామన్న భయంతో ప్రజలు నివసిస్తున్న పరిస్థితులుంటే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజల్లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలకు బాధ్యత వహించాలి. ఆరు నెలలుగా మరణాలు సంభవిస్తుంటే శాఖాపరంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.  ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల వైయ‌స్ఆర్‌సీపీ నమన్వయకర్తలు  షేక్‌ నూరిఫాతిమా గారు, గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, అన్నాబత్తిన శివకుమార్, షేక్‌ గులాంరసూల్‌తో పాటు, పార్టీ డాక్టర్స్‌ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శివభార్గవ్‌రెడ్డితో పాటు, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa