ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి ఆఫర్‌ల మోసాలు జాగ్రత్త! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

Crime |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 10:46 PM

 కాలం మారింది, కానీ కేటుగాళ్ల దోపిడీ పద్ధతులు మాత్రం మరింత చాకచక్యంగా మారుతున్నాయి. ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఇప్పుడు వారు దూరం నుంచే జేబులు ఖాళీ చేస్తున్నారు.దొంగతనాలు, దారి దోపిడీలు చేసిన రోజులు పోయాయి. ఇప్పుడు కూర్చున్నచోట నుంచే టెక్నాలజీ సాయంతో జనాలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా అలాంటి ఘరానా స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. పండుగ ఆఫర్ల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.తాజా సమాచారం ప్రకారం, ఈ దసరా–దీపావళి సీజన్‌లోనే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 390 మందిని మోసం చేసి, రూ. 8.5 లక్షల వరకు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.పండుగల సమయంలో చాలా కంపెనీలు నిజమైన ఆఫర్లు ప్రకటిస్తాయి. అదే సమయంలో, నకిలీ ఆఫర్లతో సైబర్ మోసగాళ్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఫేక్ లింకులు పంపించి వాటిని క్లిక్ చేయించేలా ప్రజలను ప్రలోభపెడుతున్నారు. ఆ లింకుల ద్వారా మాల్‌వేర్ పంపించి, మొబైల్‌లోని బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా దోచేస్తున్నారు.తమ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలియకముందే డబ్బు మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. దీపావళి వేళ ఇలాంటి మోసాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.           
*పోలీసుల సూచనలు:తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆఫర్ లింకులు, మెసేజీలు, ఫోటోలు క్లిక్ చేయవద్దు.ఫేక్ వెబ్‌సైట్లను గుర్తించండి — వెబ్ అడ్రెస్ సరైనదా అని చెక్ చేసుకోండి.“ఆఫర్ బాగుంది” అని అనుకుని క్లిక్ చేస్తే, మీ అకౌంట్‌లోని డబ్బు మొత్తం మాయమయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి పండుగ సీజన్‌లో కొనుగోళ్లు చేసే ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.ఆఫర్ ముందు ఆలోచించండి – లేకపోతే అకౌంట్ ఖాళీ అవుతుంది!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa