ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొహ్సిన్ నఖ్వీకి మద్దతు పలికిన మహమ్మద్ యూసుఫ్

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 05:25 PM

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి మద్దతు ప‌లికాడు. భారత జట్టు ప్రవర్తనను తప్పుబడుతూ, వారికి ట్రోఫీ ఇవ్వకపోవడమే సరైన చర్య అని వ్యాఖ్యానించాడు.ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా టీమిండియా, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు అందజేయకుండా తనతో పాటే తీసుకెళ్లారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌కు చెందిన 'సమా టీవీ' ఛానెల్‌తో యూసుఫ్ మాట్లాడాడు."ఛైర్మన్ (మొహ్సిన్ నఖ్వీ) చేసింది పూర్తిగా సరైనదే. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు" అని యూసుఫ్ అన్నాడు. "ఏసీసీ, ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆయన అక్కడ ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే ట్రోఫీని తీసుకోవాలి. ఆ సమయంలో మీరు తీసుకోలేదు. మరిప్పుడెందుకు ఆ తొందర? ట్రోఫీ గుర్తుకువచ్చినప్పుడు ఆయన ఆఫీసుకు వెళ్లి తెచ్చుకోవాల్సింది" అని పేర్కొన్నాడు.అంతటితో ఆగకుండా భారత జట్టుపై యూసుఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "మైదానంలో మీరు మీ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను. వాళ్లు సినిమా ప్రపంచం నుంచి బయటకు రావడం లేదు. ఇది క్రీడ, ఇది క్రికెట్. ఇక్కడ సినిమాలు నడవవు. సినిమాల్లో రీటేక్‌లు ఉంటాయి కానీ, క్రీడల్లో అలా కాదు. ఇప్పుడు మీకు ట్రోఫీ కావాలంటున్నారు" అంటూ ఎద్దేవా చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa