ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్‌లకు నీటి శవాసనం..! రూ.4 వేల కోట్లు సముద్రంపాలు!

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:11 PM

ఎన్ని మొబైల్ ఫోన్లు వచ్చినా ఐఫోన్‌కు ఉండే క్రేజ్ వేరు. ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్‌లో విడుదల అయ్యింది. దీనిలోని ప్రారంభ ధర భారత్‌లో సుమారు రూ. 50 వేలుగా ఉంది.అయితే, దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నౌక ప్రమాదంలో సుమారు 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయని సమాచారం. వాటిలోని దాదాపు 5 లక్షల ఐఫోన్ 17లు కూడా నీటిలో మునిగినట్లు అంచనా వేస్తున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 4 వేల కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి, అయితే ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు.పెరూలో ప్రముఖ నౌకాయాన సంస్థ ఎవర్ గ్రీన్‌కు చెందిన కార్గో నౌక ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. షెన్ జెన్ (చైనా) నుంచి లాస్ ఏంజల్స్‌కు బయలుదేరిన ఈ నౌక, పెరూ తీరంలో బలమైన గాలులు మరియు అలల కారణంగా ప్రమాదంలో పడింది. ఈ ఘటనలో సుమారు 50 కంటైనర్లు పసిఫిక్ సముద్రంలో మునిగిపోయాయి.న్యూట్స్ సుమారుగా 5 లక్షల ఐఫోన్ 17లు కూడా ఇందులో ఉన్నాయని అంచనా. నష్టం విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా నెటిజన్లలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.నెటిజన్ల రియాక్షన్లు కూడా విభిన్నంగా ఉన్నాయి. కొందరు “ఇది నిజమేనా?” అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు “నేచర్ ఈజ్ కాలింగ్”, “ఇది వాటర్ ప్రూఫ్ ఫోన్” అని కామెంట్లు చేస్తున్నారు. ఒకరు “నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం” అని పోస్ట్ చేశారు, మరొకరు అడ్రస్ అడుగుతున్నారు. కొందరు “లొకేషన్ ప్లీజ్” అని కామెంట్ చేస్తున్నారు, మరొకరు “నేను ఈత నేర్చుకోలేక బాధపడుతున్నానని” చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa