పంది మూత్రపిండం అమర్చిన 67 ఏళ్ల ఓ రోగి రికార్డు సృష్టించాడు. అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్కు చెందిన టిమ్ ఆండ్రూస్ రికార్డు స్థాయిలో 271 రోజులు జీవించాడు. దాదాపు 9 నెలల పాటు అతడిలో పంది కిడ్నీ పనిచేసింది. అనంతరం కిడ్నీ పనితీరు క్షీనించడంతో.. ఇటీవల పంది మూత్రపిండాన్ని తీసేశారు. కాగా, ఈ సంఘటనతో ఇప్పటివరకు మనిషి కిడ్నీకి ప్రత్యామ్నాయంగా.. పంది మూత్రపిండంపై చేస్తున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడినట్లు అయింది. బోస్టన్లోని మసాచుసెట్ట్స్ జనరల్ హాస్పిటల్లో ఈ ప్రయోగం జరిగింది.
టిమ్ ఆండ్రూస్ 1990ల నుండి డయాబెటిస్ ఉంది. కానీ అతడికి చివరి దశ కిడ్నీ వ్యాధి ఉందని మూడు సంవత్సరాల క్రితం తెలుసుకున్నాడు. దీంతో అతిడికి డయాలసిస్ చేశారు. అయితే డయాలసిస్ అతడి ప్రాణాన్ని కాపాడినప్పటికీ.. కిడ్నీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయితే రిస్క్ అని తెలిసినప్పటికీ ఆండ్రూస్ జెనోట్రాన్స్ప్లాంట్కు ఒప్పుకున్నాడు. జెనోట్రాన్స్ప్లాంట్ అంటే ఒక జంతువు అవయవాన్ని మనిషికి అమర్చడం. ఇలా చేయడం ప్రమాదకరమని తెలినప్పటికీ.. అది అతడిని డయాలసిస్ నుండి దూరంగా ఉంచగలిగితే చాలు అనుకున్నాడు. అంతేకాకుండా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఇతరులకు సహాయం చేయగలిగితే చాలనుకున్నాడు.
అందులో భాగంగా2025 జనవరి 25న అతడికి పంది కిడ్నీ అమర్చారు. ఇజెనిసిస్ అనే కంపెనీ పంది కిడ్నీని.. మనిషి శరీరానికి సరిపోయేటట్టు జన్యు మార్పిడి చేసిన తర్వాత ఆండ్రూకు అమర్చారు. కాగా అమెరికాలో ఇలా పంది కిడ్నీ అమర్చిన నాలుగో వ్యక్తిగా ఆండ్రూస్ నిలిచాడు. మొదటి ఇద్దరు పంది మూత్రపిండం అమర్చిన కొద్ది సేపటికే మృతిచెందారు. మూడోసారి ఓ మహిళకు అమర్చారు. ఆమె అప్పుడు 130 రోజులు పంది కిడ్నీతో బతికి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ.. 271 రోజులు బతికింది ఆండ్రూస్ మాత్రమే. ప్రస్తుతం ఇతడికి డయాలసిస్ తిరిగి ప్రారంభించనున్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు, చాలా మంది కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్క అమెరికాలోనే.. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురుచూస్తున్న లక్ష మందికి పైగా వ్యక్తుల్లో.. 90 వేల మంది దాకా కిడ్నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆండ్రూస్కు అమర్చిన పంది కిడ్నీ జినోమ్కు.. 69 జీన్ ఎడిట్స్ చేశారు. వైరస్లను తట్టుకునేటట్లు, మనిషికి కచ్చితంగా సరిపోలేటట్లు, రోగనిరోధకత కోసం ఈ మార్పులు చేశారు. అయితే పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లు కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే చేస్తున్నారు. ఇంకా స్టాండర్డ్ క్లినికల్ ప్రొసీజర్గా అందరికీ అందుబాటులోకి రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa