మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన నిరసన ర్యాలీలకు కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదామని, అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం రేపు జిల్లా స్ధాయిలో, ఎల్లుండి నియోజకవర్గ స్ధాయిలో ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్లు ఆవిష్కరించాలని సూచించారు. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆయన తెలిపారు. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్పై ప్రతి ఒక్కరూ సీరియస్గా దృష్టిపెట్టాలని, పార్టీ కార్యక్రమాలను డిజిటల్, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్) , రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa