జపాన్లోని పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా పేలింది. వాతావరణ సంస్థ (JMA) తెలిపినట్టు, మొదటి పేలుడు ఉదయం 1 గంటల సమయంలో జరిగింది. ఆ తర్వాత ఉదయం 2:30 మరియు 8:50 గంటలకు మరిన్ని పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతంగా ఉండటంతో, లావా మరియు బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయి. ఇది గత 13 నెలల్లో బూడిద ఇంత ఎత్తుకు చేరిన మొదటి సందర్భం అని విశ్లేషకులు తెలిపారు.కగోషిమా నగరం మరియు పరిసర ప్రాంతాలపై బూడిద పొర పేరుకుపోవడంతో దృశ్యమానత గణనీయంగా తగ్గింది. విమానాశ్రయంలో పరిస్థితి మరింత బలహీనంగా మారింది, ఫలితంగా దాదాపు 30 విమానాలను రద్దు చేయవలసి వచ్చింది. ప్రయాణికులు పలు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది మరియు చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేశారు. స్థానిక అధికారులు ప్రజలకు ఇంట్లో ఉండి, తప్పనిసరిగా మాస్క్లు ధరించవలసిందిగా, అవసరం లేని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.స్థానిక మీడియా కథనం ప్రకారం, సకురాజిమా అగ్నిపర్వతంలో చిన్న విస్ఫోటనాలు తరచుగా జరుగుతుంటాయి. కానీ ఈసారి పేలుడు గరిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా బూడిద మరియు వేడి వాయువులు విస్తృతంగా బయటకు వెల్లాయి. శాస్త్రవేత్తలు రాడార్ మరియు ఉపగ్రహాలను ఉపయోగించి అగ్నిపర్వతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.సకురాజిమా జపాన్లో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. 2019లో ఇదే అగ్నిపర్వతం 5.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిదను విసర్జించగా, ఇప్పుడు కూడా అధికారులు అత్యంత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం సంభవించకపోవడం ఉపశమనం కలిగించే విషయం. అయితే, ఈ విస్పోటనం నగరంలో పారిశుద్ధి మరియు రవాణాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.ఈ అగ్నిపర్వతం జపాన్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్పోటనాలు తరచుగా సంభవిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తూ, భద్రతా ఏర్పాట్లను జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa