ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని చంద్రబాబు ప్రైవేట్ చెయ్యడానికి కుట్ర పన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 12:03 PM

సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలకు తెర లేపారని, సీఐఐ సదస్సు తర్వాత ఆయన చేసిన వైట్‌ ఎలిఫెంట్‌ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్‌ కార్మికులు పని చేయకుండా తిని కూర్చుంటున్నారంటూ, వారి వల్లే ప్లాంట్‌ నష్టపోయిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్న కేంద్రానికి ఆయుధం అందించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు చేసిన వాగ్దానాలకు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న విడదల రజిని, పథకం ప్రకారం ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని వివరించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాకపోయినా గడిచిన ఐదేళ్లు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా వైయస్‌ జగన్‌ నిలువరించగలిగారని, కానీ టీడీపీ సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని మాజీ మంత్రి ఆక్షేపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, సంస్థను ప్రైవేటుపరం చేయడం లేదంటూ ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని విడదల రజిని సవాల్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa