ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో పసుపుని ఇలా వాడితే స్కిన్ మెరుస్తుంది

Life style |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 11:17 PM

పచ్చి పసుపుని చలికాలంలో స్కిన్‌కి రాస్తే చలా సమస్యలు దూరమవుతాయి. ఇందులోని గుణాలు స్కిన్‌ని మెరిపించేలా చేస్తాయి. ఇందులోని సహజ నూనెలు, పోషకాలు చర్మాన్ని సాఫ్ట్‌గా చేస్తాయి. మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంపై ఎరుపుని, మచ్చల్ని తగ్గిస్తాయి. స్కిన్‌ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇన్ని లాభాలున్న పచ్చి పసుపుని ఎలా వాడాలి, ఏయే పదార్థాలతో కలిపి రాస్తే రిజల్ట్ ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే స్కిన్‌పై ఎలాంటి సమస్యలు ఉండవు.


పెరుగు, తేనెతో మెరుపు


పచ్చి పసుపుని మెత్తగా చేయాలి. అందులో రెండు టీ స్పూన్ల తాజా పెరుగు, కొన్ని చుక్కల తేనె కలపండి. ప్యాక్‌లా చేయండి. దీనిని ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా, చల్లగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులో పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది. తేనేని మాయిశ్చరైజేషన్‌ని అందిస్తుంది. మొత్తంగా స్కిన్ మెరుస్తుంది.


నెయ్యితో పసుపు కలిపి రాస్తే


చలికాలంలో స్కిన్ డ్రైగా మారడం సహజం. ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు నెయ్యితో కలిపి రాయొచ్చు. పచ్చిపసుపుని కొద్దిగా పేస్టులా చేయాలి. అందులోనే కాస్తా నెయ్యి వేసి కలపండి. పేస్టులా అయ్యాక దానిని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత వేడి నీటిలో ముంచిన క్లాత్‌తో ముఖాన్ని క్లీన్ చేయండి. దీని వల్ల ఎలాంటి కెమికల్స్ లేకుండానే స్కిన్ మెరుస్తుంది.


గ్లో కోసం గంధంతో కలిపి


చలికాలంలో చర్మం కాస్తా ట్యాన్ పేరుకుపోయినట్లుగా ఉంటుంది. దీనికోసం కొద్దిగా గంధంలో పచ్చి పసుపు పేస్టుని వేయండి. అందులోనే రోజ్‌వాటర్ వేయండి. గంధం స్కిన్‌ని చల్లగా మారుస్తుంది. పసుపు పిగ్మెంటేషన్‌ని దూరం చేస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికి ఓ సారి రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే మంచి స్కిన్ మీ సొంతమవుతుంది.


తాగడానికి పసుపు పాలు


పచ్చి పసుపుని పాలలో వేసి తాగడం వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమవ్వడానికి హెల్ప్ అవుతాయి. పచ్చి పసుపులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తాయి. ఓ గ్లాసు పాలని మరిగించి అందులో పచ్చి పసుపుని తురిమి వేయాలి. అందులోనే చిటికెడు నల్ల మిరియాల పొడి వేయాలి. కాసేపు మరిగిన తర్వాత మంటని ఆఫ్ చేయాలి. తర్వాత పాలు గోరువెచ్చగా అయ్యాక తేనె కలిపి తాగాలి. ఇలా రోజూ తాగితే సహజంగానే మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది.


వాడే ముందు


అదే విధంగా, పసుపు రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముక్యం. కొంతమందికి పసుపు పడదు. అలాంటప్పుడు దీనిని ఎక్కువగా వాడొద్దు. దీంతో పాటు ఇది కొద్దిగా రాయగానే పసుపు పచ్చగా కనిపిస్తుంది. కాబట్టి, మైల్డ్ క్లెన్సర్ వాడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa