ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 03:29 PM

 వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టపడి చదవాలన్నారు. చదువుతో పాటు ఆట, పాటలు కూడా ఉండాలన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందని, భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందన్నారు. పిల్లల బలాలు, బలహీనతలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa