ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో విమానాల రద్దు వేళ,,,,రైల్వేశాఖ కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 09:06 PM

నిర్వహణ లోపం కారణంగా ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విమానాల రద్దు గురించి ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2026, ఫిబ్రవరి వరకు ఇండిగో సాధారణ సేవలు సాధ్యం కాదని ఇండిగో సీఈవో ప్రకటించారు.


అసభ్యంగా మాట్లాడుతున్నారు..తట్టుకోలేకున్నా.. నా మనోవేదన అర్థం చేసుకోండి.. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్..


ఇక వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. ఇతర విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందిని ఆసరాగా చేసుకుని దోపిడీకి తెర తీశాయి. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి గాను టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.లక్ష దాటాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలోవారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.


వందల సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు భారీ ఊరట కలిగించే వార్త. ఇండిగో విమానాలు రద్దు వేళ.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్‌లను యాడ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఇతర విమానయాన సంస్థల చేతిలో దోపిడీకి గురి కాకుండా చూడటం కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది.


ఈక్రమంలో దక్షిణ రైల్వే పరిధిలో నడిచే రైళ్లకే అత్యధికంగా బోగీలను జత చేసినట్లు ప్రకటించింది. సౌత్ రైల్వే పరిధిలో.. అత్యధికంగా18 రైళ్లకు బోగీలను పెంచినట్లు వెల్లడించింది. దీంతో పాటుగా.. డిమాండ్ అధికంగా ఉన్న మార్గాల్లో అదనపు స్లీపర్ క్లాస్ కోచ్‌, చైర్ కార్‌లను జత చేసినట్లు అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 6 నుంచి ఈ అదనపు కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.


ఇక, ఉత్తర రైల్వే పరిధిలో కూడా 8 రైళ్లలో బోగీలను పెంచారు. అలానే పలు రైళ్లలో 3 ఏసీ, చైర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. పశ్చిమ రైల్వే విషయానికి వస్తే.. నాలుగు రైళ్లకు 3 ఏసీ, 2ఏసీ కోచ్‌లను జత చేశారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నేటి నుంచి అంటే.. 2025 డిసెంబర్ 6-10వ తారీఖు వరకు 5 ట్రిప్పులకు అదనంగా 2ఏసీ కోచ్‌లతో రాజేంద్ర నగర్-న్యూఢిల్లీ (12309) మధ్య అదనంగా పెంచారు. ఇది బిహార్-ఢిల్లీ సెక్టార్‌లో ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.


ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్-న్యూఢిల్లీ మధ్య సేవలందించే రైళ్లు 20817/20811/20823 ఐదు ట్రిప్పులకు సంబంధించి 2 ఏసీ కోచ్‌లను జత చేసి.. సేవలను పెంచింది. ఇది ఒడిశా-ఢిల్లీల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. గోరఖ్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్-గోరఖ్‌పూర్ స్పెషల్ (05591/05592) డిసెంబర్ 7, 9 మధ్య 4 ట్రిప్పులను నడుపుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa