దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు తీవ్ర వివాదాస్పదంగా మారింది. వరుసగా ఐదో రోజు కూడా ఇండిగో విమాన సేవలకు అంతరాయం కొనసాగింది. శనివారం కూడా ఇండిగో వందలాది విమానాలు రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో వివాదం మీద దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
దీనిపై తక్షణ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అభ్యర్థించారు. ఈ సంక్షోభంపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు.
నేడు, శనివారం ఒక్కరోజే 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానయాన సంస్థలలో వెళ్లిపోతున్నారు. అవి కూడా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి రైల్వే శాఖ కూడా చర్యలు చేపట్టింది. ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి 37 రైళ్లకు అదనంగా 116 బోగీలను జోడించింది. ఢిల్లీ ఎయిర్పోర్టు ఒక ప్రకటన విడుదల చేస్తూ, సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, అయితే కొన్ని సర్వీసులపై ప్రభావం ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.
పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్వర్క్ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని విమానయాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో లేదో నిర్ధారిస్తామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఎక్కడ ఎలాంటి తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పాలిచ్చే తల్లులు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులకు విమానయానంలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్ ఆపరేటర్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa