గోవాలోని బర్చ్ బై రోమియో లేన్ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో 25 మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది క్లబ్ స్టాఫ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్పోరా గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా మృతులను గుర్తించలేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. నైట్క్లబ్ మేనేజర్, యజమానిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు.
బాలీవుడ్ బ్యాంగర్ నైట్ పేరుతో క్లబ్నిర్వహించిన ప్రోగ్రాంలో భాగంగా షోలే సినిమాలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. మొదటి ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, దట్టమైన పొగ అలముకుంది. దీంతో మ్యూజిక్ను నిలిపేసి.. అక్కడున్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదానికి కారణాలు ఏంటి?
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. క్లబ్ మొదటి అంతస్తులో మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో డ్యాన్స్ ఫ్లోర్లో 100 మంది ఉన్నారు. అయితే బయటకు వెళ్లే మార్గంలో చిన్న తలుపులు, ఇరుకు మార్గం ఉండడంతో.. బాధితులు బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. కొంతమంది గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కిచెన్లోకి వెళ్లి.. అక్కడే చిక్కుకుపోయినట్లు ప్రత్య క్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఈ దుర్ఘటనకు సిలిండర్ పేలడమే కారణమని రాష్ట్ర పోలీసులు మొదటి పేర్కొన్నారు. అయితే డ్యాన్సింగ్ రూమ్లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నైట్క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. బాధితులు బయటకు రాలేకపోయారని.. చాలా మంది ఊపరాడకపోవడం వల్లే చనిపోయారన్నారు. క్లబ్.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని అన్నారు. క్లబ్ నిర్వాహకులను, దానికి అనుమతి ఇచ్చిన అధికారులుపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలో సోమవారం నుంచి ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ మృతులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.గోవాలోని బర్చ్ బై రోమియో లేన్ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో 25 మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది క్లబ్ స్టాఫ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్పోరా గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా మృతులను గుర్తించలేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. నైట్క్లబ్ మేనేజర్, యజమానిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు.
బాలీవుడ్ బ్యాంగర్ నైట్ పేరుతో క్లబ్నిర్వహించిన ప్రోగ్రాంలో భాగంగా షోలే సినిమాలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. మొదటి ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, దట్టమైన పొగ అలముకుంది. దీంతో మ్యూజిక్ను నిలిపేసి.. అక్కడున్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదానికి కారణాలు ఏంటి?
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. క్లబ్ మొదటి అంతస్తులో మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో డ్యాన్స్ ఫ్లోర్లో 100 మంది ఉన్నారు. అయితే బయటకు వెళ్లే మార్గంలో చిన్న తలుపులు, ఇరుకు మార్గం ఉండడంతో.. బాధితులు బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. కొంతమంది గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కిచెన్లోకి వెళ్లి.. అక్కడే చిక్కుకుపోయినట్లు ప్రత్య క్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఈ దుర్ఘటనకు సిలిండర్ పేలడమే కారణమని రాష్ట్ర పోలీసులు మొదటి పేర్కొన్నారు. అయితే డ్యాన్సింగ్ రూమ్లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నైట్క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. బాధితులు బయటకు రాలేకపోయారని.. చాలా మంది ఊపరాడకపోవడం వల్లే చనిపోయారన్నారు. క్లబ్.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని అన్నారు. క్లబ్ నిర్వాహకులను, దానికి అనుమతి ఇచ్చిన అధికారులుపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలో సోమవారం నుంచి ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ మృతులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa