ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పదవిపై నవజోత్ కౌర్ సిద్ధూ వ్యాఖ్యలకి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:52 PM

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత వ్యవహారాలపై ఆ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. "రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వారే ముఖ్యమంత్రి అవుతారు" అంటూ ఆమె చేసిన ఆరోపణపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రంగా స్పందించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. "పంజాబ్ సీఎం పదవి ధర రూ.500 కోట్లని నవజోత్ కౌర్ బహిరంగంగా చెప్పడం ద్వారా కాంగ్రెస్‌లోని 'మనీ బ్యాగ్' రాజకీయాలను బట్టబయలు చేశారు. అంత డబ్బు తన భర్త చెల్లించలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. ఒక సీనియర్ నేత భార్యే ఈ మాట చెప్పడం కాంగ్రెస్‌లో నైతిక పతనాన్ని సూచిస్తోంది" అని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు పంజాబ్ రాజకీయాలను ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి డబ్బుతో నడిచే వేలం వ్యవస్థగా మార్చాయని ఆయన ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa