ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవా అగ్నిప్రమాదంలో నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:26 PM

గోవాలోని నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా థాయ్ లాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే, లూథ్రా బ్రదర్స్ పరారీలో ఉండడంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. థాయ్ లాండ్ కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పుకెట్ లో దాక్కున్న లూథ్రా బ్రదర్స్ ను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి చేతికి సంకెళ్లు వేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే వారిని భారత్ కు పంపించనున్నట్లు థాయ్ లాండ్ పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa