ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌లో ఘోరం, చిన్నారులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన వైద్యులు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 09:04 AM

మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సత్నాలోని ప్రభుత్వ వైద్యశాలలో తలసేమియాతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం తరచూ రక్తమార్పిడిపై ఆధారపడే ఈ చిన్నారులకు మూడు వేర్వేరు బ్లడ్ బ్యాంకుల నుంచి మొత్తం 189 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. ఈ క్రమంలో వారు 150 మందికి పైగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పొందాల్సి వచ్చింది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని జిల్లా స్థాయి విచారణలో తేలింది. ఈ ఘటనపై స్పందించిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్‌తో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేసింది. సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ మనోజ్ శుక్లాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది మార్చిలోనే ఈ చిన్నారులలో మొదటి హెచ్‌ఐవీ పాజిటివ్ కేసు నమోదైంది. ఏప్రిల్ నాటికి మరికొందరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలల పాటు ఆసుపత్రి యాజమాన్యం, జిల్లా అధికారులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల్లో ఒక చిన్నారి తండ్రి ఎన్డీటీవీతో మాట్లాడుతూ, "ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏం జరుగుతుంది?" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa