ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులను పోషించే దేశంపై జాలి అవసరం లేదు: భారత విద్యార్థి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 12:30 PM

ఇటీవల ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ డిబేట్‌లో ముంబయికి చెందిన భారత విద్యార్థి విరాన్ష్‌ భానుశాలి పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఎప్పుడూ ఇతర దేశాలను అడ్డం పెట్టుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని చూడదని, ముంబయి ఉగ్రదాడి వంటి సంఘటనల తర్వాత కూడా శాంతియుత పరిష్కారానికే ప్రయత్నించిందని ఆయన పేర్కొన్నారు. పఠాన్‌కోట్, ఉరి, పుల్వామా, పహల్గాంలలో జరిగిన ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులను పోషించే దేశంపై జాలి చూపాల్సిన అవసరం లేదని విరాన్ష్‌ అన్నారు. ఆయన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa