ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి స్థాపనకి కృషి చేశారంటున్న చైనా

international |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 01:34 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇప్పుడు చైనా కూడా భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి స్థాపన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను (ఆపరేషన్ సిందూర్) తగ్గించడంలో తాము మధ్యవర్తిత్వం వహించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సంబంధాల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాక్ ఉద్రిక్తతలను కూడా చైనా చొరవతోనే పరిష్కరించామని పేర్కొన్నారు. "మేము నిష్పక్షపాతంగా వ్యవహరించి, సమస్య మూలాలను అడ్రస్ చేశాం" అని వాంగ్ యీ చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa