భారత జట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో తిరిగి జట్టులో చేరారు.ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులో పునఃప్రవేశించారు. అయితే, అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. శ్రేయాస్, జనవరి 6న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున ఆడనున్నారు. ఆ సమయంలో అతని ఫిట్నెస్ లెవల్స్ను వైద్యులు అంచనా వేయనున్నారు. ఎలాంటి సమస్య లేకుండా ఆడితే, ఆయన్ను కివీస్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక చేస్తారు. అయినా, అతనికి ఎటువంటి సమస్య ఉంటే, ఆయన తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వెళ్లాల్సి ఉంటుంది.శ్రేయాస్ అయ్యర్ జట్టులో తిరిగి చేరడం వల్ల మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ, సెలక్టర్లు ఈ సిరీస్లో అతడిని ఎంపిక చేయలేదు.ఈ సిరీస్లో టీ20 ప్రపంచకప్ 2026 దృష్టిలో ఉంచుకుని, జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి చేరారు. సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు హర్షిత్ రాణాతో కూడిన పేస్ దళాన్ని లీడ్ చేయనున్నారు.గతేడాది మార్చి నుండి భారత జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్లో అవకాశం ఇవ్వలేదని సెలక్టర్లు ప్రకటించారు.ఇక, రిషబ్ పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించేందుకు వస్తున్న వార్తలపై, సెలక్టర్లు స్పష్టంగా రిజెక్ట్ చేశారు. పంత్ ఈ సిరీస్కు ఎంపిక చేయబడినట్లు అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ధారించారు. ఇషాన్ కిషన్కు అవకాశమిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ, సెలక్టర్లు పంత్కే మొగ్గు చూపించారు. కేఎల్ రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్గా ఉండనున్నాడు.హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో, ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు.భారత జట్టు మరియు న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతాయి.
*భారత జట్టు - న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఎంపికైన 15 మంది:
-శుభ్మన్ గిల్ (కెప్టెన్)
-రోహిత్ శర్మ
-విరాట్ కోహ్లీ
-కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
-శ్రేయాస్ అయ్యర్ (ఫిట్నెస్కు లోబడి)
-వాషింగ్టన్ సుందర్
-రవీంద్ర జడేజా
-మహ్మద్ సిరాజ్
-హర్షిత్ రాణా
-ప్రసిద్ధ్ కృష్ణ
-కుల్దీప్ యాదవ్
-రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
-నితీశ్ కుమార్ రెడ్డి
-జైశ్వాల్
-అర్ష్దీప్ సింగ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa