ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయడంపై స్పందించబోనన్న క్రికెట్ బోర్డు అధికారి

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 11:03 PM

ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి విడుదల చేయడంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్‌ను భారత్ వేదికగా ఆడేందుకు బంగ్లాదేశ్ అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. ఈ మేరకు భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని భావిస్తోంది.గత కొద్ది కాలంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికలను మార్చాలని ఐసీసీ దృష్టికి తీసుకువెళతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.కోల్‌కతా జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను విడుదల చేయడంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఐపీఎల్ వారి అంతర్గత విషయమని వెల్లడించారు. ప్రపంచ కప్‌లో పాల్గొనే అంశం మాత్రం ఐసీసీ ఈవెంట్ కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్చిస్తుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa