ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో ఇద్దరు దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 04:09 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కంధనాతిలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. స్థానికులైన వెంకటేశ్, పరమేశ్, గోవింద్‌పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేశ్, పరమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన గోవింద్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, గోవింద్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదిస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa